ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి
ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి ఈ మంత్రివర్గం సమావేశం అవుతోంది. ఈ భేటీలో ఆపరేషన్ సిందూర్ కి దారితీసిన పరిస్థితులు, తదనంతర పర్యవసానాలను సహచర మంత్రులకు ప్రధాని వివరించే అవకాశం ఉంది. అలాగే జనాభా లెక్కలతో పాటు కుల గణనపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.