టీటీడీ సరికొత్త ఆలోచన.. భక్తుల కోసం ఆ సౌకర్యం..
తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుందని ఆలయ ఈవో శ్యామల రావు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఆధారిటీ చాట్ బాట్ ను రూపొందిస్తోందని ఆయన చెప్పారు. ఇది చాట్ జీపీటీ తరహాలో పనిచేస్తుందని, భక్తులు ఇకపై సమాచారం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదన్నారు. కేవలం వాయిస్ ద్వారా అడిగినా, ఏ భాషలో అడిగినా వెంటనే సమాధానం లభిస్తుందని పేర్కొన్నారు. గదుల బుకింగ్ ఇక సులభతరం కానుందని ఆయన తెలిపారు.