రేపటి నుంచి ఖాతాల్లో డబ్బులు
రాష్ట్రంలోని రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులను రేపటి నుంచి బదిలీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రైతు భరోసా పథకానికి లబ్దిదారుల జాబితాను ఆర్థిక శాఖకు అందజేసింది. ఈ జాబితాలో ముందుగా ఎకరం, రెండు, మూడు, నాలుగు,ఐదు ఎకరాలు.. ఆపైన రైతుల వివరాలను పేర్కొన్నారు. ఇప్పటికే రైతు భరోసా నిధుల పంపిణిపై సీఎం రేవంత్ రెడ్డి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.