తిరుమల వెళ్ళే భక్తులకు అలెర్ట్

News Published On : Wednesday, June 4, 2025 07:05 AM

తిరుమల శ్రీవారి దర్శనార్థం శ్రీవారిమెట్టు మార్గంలో నడిచివెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సమాచారం అందించింది. శ్రీవారిమెట్టు వద్ద ప్రస్తుతం కేటాయిస్తున్న దివ్యదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను తాత్కాలికంగా అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ కు మార్చుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ నూతన కౌంటర్లు జూన్ 6వ తేదీ సాయంత్రం నుంచి భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.