Breaking: ముగ్గురు భారత జవాన్లు మృతి
జమ్ము కశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంభవన్ దగ్గర లోయలో ఓ ఆర్మీ వాహనం కిందపడింది ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన రెస్క్యూ టీమ్ అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపడుతోంది. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.