తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

News Published On : Saturday, May 31, 2025 10:41 AM

తిరుమల దేవస్థానంలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. ఈ మేరకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టనుంది. నిన్న శ్రీవారిని 71,721 మంది భక్తులు దర్శించుకున్నారు. అంతేకాకుండా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.42 కోట్లుగా ఆలయ కమిటీ నమోదు చేసింది.