విద్యుత్ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
విద్యుత్ శాఖ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశ అభివృద్ధిలో విద్యుత్ శాఖదే కీలక పాత్ర అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించేలా రూ.కోటి ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు SBIతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఈ రోజు హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో జరిగిన కార్యక్రమంలో SBIతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల ఉద్యోగుల్లో నమ్మకాన్ని, ధైర్యాన్ని పెంచుతుందని బట్టి పేర్కొన్నారు.