సీఎం చంద్రబాబును కలిసిన సోనూసూద్
ప్రముఖ సినీ నటుడు, మానవతావాది సోనూసూద్ సోమవారం అమరావతిలోని ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ ఫౌండేషన్ తరపున నాలుగు అంబులెన్స్ లను అందించారు.
అనంతరం నాలుగు అంబులెన్స్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఈ విషయంలో సోనూసూద్ ఫౌండేషన్ భాగస్వామి అయినందున చంద్రబాబు అభినందనలు తెలిపారు.