రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం
తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ ఏప్రిల్ నుంచి 6కిలోల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని 84 శాతం మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని చెప్పారు. ఈ నెల 30న హుజూర్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
దొడ్డు(లావు) బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని అన్నారు. ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నామని వెల్లడించారు.