వారి రేషన్ కార్డులు రద్దు
గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకొని వారి కార్డులను పరిశీలించి తొలగించాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. వీటిపై విచారణ చేసి అనర్హులని తేలితే కార్డులు రద్దు చేయాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికే 80% కార్డులపై విచారణ పూర్తవగా.. వాటిలో 30% మంది అర్హులే అని తేలినట్లు అధికారులు తెలిపారు. అందులో కొంతమంది ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టిన వారు కూడా ఉన్నారని పేర్కొన్నారు.