నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 48 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్

News Published On : Friday, January 24, 2025 12:42 PM

పోస్టల్‌ శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా పోస్టాఫీసుల్లో ఖాళీగా ఉన్న 48 వేల గ్రామీణ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ పోస్టులకు జనవరి 29న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.

ఏటా రెండు సార్లు ఖాళీలను పోస్టల్‌ శాఖ భర్తీ చేస్తుంది. గత సంవత్సరం జులైలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ కాకుండా మిగిలిన ఉద్యోగాలతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను ప్రస్తుతం భర్తీ చేయనున్నారు. 

టెన్త్‌ పాసైన వారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థుల వయసు 18 ఉంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులకు పదో తరగతిలో వచ్చిన మార్కులు (గ్రేడ్‌), రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు పరీక్ష ఫీజు ఉండదు. మిగతా అభ్యర్థులు దరఖాస్తులు ఫీజుగా రూ.100 చెల్లించాలి. రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలను నోటిఫికేషన్‌ లో పేర్కొననుంది.