ఇండియన్ ఆర్మీ అదుపులో పాకిస్తాన్ F-16 పైలెట్
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్కు చావుదెబ్బ తగిలింది. అయినా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోకుండా.. భారత్ మీద దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. జమ్ము, పఠాన్కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలపై పాకిస్తాన్ దాడులకు తెగబడిందని రక్షణశాఖ తెలిపింది. పాక్ ప్రయోగించిన ఎనిమిది మిసైల్స్ను భారత సైన్యం వీరోచితంగా కూల్చేసింది. పాక్ దాడుల్లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టామని రక్షణశాఖ వెల్లడించింది.
పాకిస్తాన్ చేస్తున్న దాడులను సమర్థవంతంగా తిప్పి కొడుతోంది భారత్. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, రాకెట్లను నేలమట్టం చేసింది. తాజాగా జమ్మూలోని అఖ్నూర్ సమీపంలో పాక్ కు చెందిన F- 16 పైలట్ను భారత్ పట్టుకున్నట్లు సమాచారం అందుతోంది. అదే విధంగా ఒక F - 16 మరియు రెండు JF - 17 యుద్ధ విమానాలను ఇండియన్ ఆర్మీ పేల్చేసినట్లు సమాచారం.