భారత్ లో పాక్ డ్రగ్స్.. ముఠా అరెస్ట్
పాకిస్థాన్ నుంచి భారత్ లోకి డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు పంజాబ్ పోలీసులు నిఘా వేసి కుట్రను భగ్నం చేశారు. వాళ్ల నుంచి భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా 85 కిలోల డ్రగ్స్ను పోలీసులు సీజ్ చేశారు. అలాగే అమృత్ సర్ కు చెందిన అమర్ జోత్ సింగ్ జోతా సంధూను ఈ కుట్రలో ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.