బందీగా ఉన్న భారత జవాన్ ను అప్పగించిన పాక్

News Published On : Wednesday, May 14, 2025 03:14 PM

ఆపరేషన్‌ సింధూర్‌లో భారత్‌ చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్‌- ఇక దుస్సాహసాలు చేయలేకపోతోంది. పొరపాటున పాక్‌ భూభాగంలో అడుగుపెట్టిన భారత జవాన్‌ను తిరిగి అప్పగించింది. BSF జవాను పూర్ణమ్ సౌను 20 రోజులపాటు పాక్‌లో బందీగానే ఉండగా పాకిస్థాన్ అధికారులు క్షేమంగా పంపించారు. భారతదేశం నుండి బలమైన ఒత్తిడి, చివరకు పాకిస్తాన్ BSF జవాను పూర్ణమ్ సౌను విడుదల చేయవలసి వచ్చింది.