తొక్కిసలాట ఘటన: గాయపడిన వారికి నోటీసులు
బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెంది, పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గాయపడిన 45 మందికి బెంగళూరు అర్బన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 11న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల మధ్య బెంగళూరులోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న మెజిస్టీరియల్ కోర్టు ఆడిటోరియానికి వచ్చి తమ వాంగ్మూలాలను నమోదు చేసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.