ఇకపై రాష్ట్రంలో మహిళ ఉద్యోగులకు నైట్ షిఫ్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై మహిళ ఉద్యోగులకు నైట్ షిఫ్టులు కూడా ఉండబోతున్నట్లు అధికారికంగా ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఉద్యోగులు అలాగే కార్మికులు రాత్రి 7 గంటల నుంచి 6 గంటల వరకు నైట్ షిఫ్ట్ చేసుకునేలా చట్ట సవరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది.ఇందు కోసం పరిశ్రమలలో భద్రత అలాగే సీసీ కెమెరాలు, రవాణా సహా ఇతర వసతులు మహిళలకు కల్పించనుంది.