నేటి నుండి ఖాతాల్లోకి డబ్బులు
తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. నేటి నుంచి రైతు భరోసా పథకం కింద రైతు ఖాతాలో నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకం కింద ప్రభుత్వం ఏడాదికి ఒక ఎకరం భూమికి రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించునున్న విషయం తెలిసిందే.
అయితే ఎకరాలతో సంబంధం లేకుండా అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం ఈ నిధులు జమ చేయనుంది. ఖరీఫ్ సీజన్ కి ముందు డబ్బులు అందుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.