అలా చేయకుంటే పాక్ ను అంతం చేస్తాం: మోడీ
పాకిస్థాన్ తో భారత్ కేవలం ఉగ్రవాదం, POKలపై మాత్రమే చర్చిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఉగ్రవాదాన్ని ఆ దేశ ప్రభుత్వం అంతం చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. లేకపోతే ఆ దేశమే సమాప్తం అవుతుందని తీవ్రంగా హెచ్చరించారు. ఉగ్రవాదం-చర్చలు, టెర్రర్- ట్రేడ్, నీళ్లు-రక్తం ఒకేమార్గంలో ప్రవహించవని ప్రధాని మరోసారి కుండబద్దలు కొట్టారు. యుద్ధంలో పాక్ కు ప్రతిసారీ దుమ్ము దులిపామని గుర్తు చేశారు.