మహిళలకు తులం బంగారం.. క్లారిటీ ఇచ్చిన మంత్రి

News Published On : Monday, March 17, 2025 02:31 PM

తెలంగాణలో మహిళలకు 'తులం బంగారం' పథకం అమలుపై మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. ఆ పథకం అమలు చేయడం లేదని చెప్పారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా బదులిచ్చారు.

పథకం తర్వాత ప్రారంభిస్తారా? అని మంత్రిని కవిత ప్రశ్నించగా లేదని పొన్నం సమాధానమిచ్చారు. దీంతో మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసం మరోసారి రుజువైందని కవిత విమర్శించారు. సమయం వచ్చినప్పుడు వారు సమాధానం చెబుతారని అన్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...