మెగా డీఎస్సీపై బిగ్ న్యూస్
ఏపీ వ్యాప్తంగా లక్షల మంది నిరుద్యోగులు ఎన్నో నెలలుగా డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలలోనే 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించారు.
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్కూళ్లు ఎక్కువ దూరంలో ఉన్న విద్యార్థులకు రవాణా భత్యం ఇస్తామని తెలిపారు. త్వరలో పాఠశాలల్లో వార్షికోత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.