సరిహద్దుల్లో వాయుసేన భారీ విన్యాసాలు

News Published On : Wednesday, May 7, 2025 08:40 AM

పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఉగ్రదాడికి కారణం పాకిస్తాన్ అని భారత్ ఆరోపిస్తుంటే..తమ మీద అనవసరంగా నిందలు వేస్తున్నారని ఆ దేశం అంటోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి. ఇదే సమయంలో భారత వాయుసేన కూడా రాజస్థాన్లోని అంతర్జాతీయ సరిహద్దులో భారీస్థాయిలో విన్యాసాలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో రఫేల్, మిరాజ్ 2000, సుఖోయ్ 30 యుద్ధ విమానాలతో ప్రదర్శన చేయనున్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...