మద్యం ప్రియులకు షాక్.. వైన్ షాపులు బంద్
గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వైన్ షాపులు, మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. శనివారం రాత్రి నుంచి ఎలాంటి జంతువులను వధించరాదని, అన్ని చికెన్, మటన్, చేపల మార్కెట్లు రేపు మూసివేయాలని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
చాలా పట్టణాల్లో అధికారులు ఇవే తరహా ఆదేశాలు జారీ చేశారు. సోమవారం వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.