డిఎస్సీకి లైన్ క్లియర్.. పరీక్షలు యథాతథం
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ కొట్టివేయడంతో ఏపీలో డీఎస్సీ పరీక్షలు యధాతధంగా జరుగుతాయి. అలాగే టెట్ పరీక్షలు కూడా యధాతధంగా జరుగుతాయని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. టెట్ తో పాటు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని సుప్రీంకోర్టులో ఆరుగురు అభ్యర్థులు పిటీషన్ వేశారు. అభ్యర్థులు లేవనెత్తిన పిటీషన్ లో సరైన కారణాలు కనిపించడం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.