గ్రూప్-2 అభ్యర్థులకు కీలక అప్డేట్
ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ రాసిన అభ్యర్థులు తమ పోస్టుల ప్రాధాన్యం, జోన్, జిల్లా ప్రాధాన్యతలు సెలక్ట్ చేసుకునే అవకాశాన్ని APPSC కల్పించింది. అభ్యర్థులు ఈ రోజు నుంచి ఈ నెల 10వ తేదీలోగా APPSC వెబ్సైటులో తమ వివరాలు అప్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
హారిజంటల్ రిజర్వేషన్ అమల్లో భాగంగా మహిళలకు కేటాయించిన పోస్టులకు సరిపడినంత మహిళా అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను పురుష అభ్యర్థులకు కేటాయించనుంది.