జ్యోతి ఫోన్ లో సంచలన విషయాలు.. ISI ఏజెంట్లతో సీక్రెట్ చాట్
పాక్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసులో మరిన్ని సంచలనాలు బయటపడ్డాయి. ISI ఏజెంట్లతో సీక్రెట్ చాట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి ఆధారాలు దొరకకుండా తన ఫోన్లో 12GB డాటా డిలీట్ చేసినట్లు వెల్లడించారు. డాటా రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మేరకు జ్యోతికి ఏమాత్రం భయం లేకుండా ఉగ్రవాదులతో పరిచయాలు పెంచుకుందని అధికారులు తెలిపారు. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సందర్శన సందర్భంగా ఆమె వాళ్లను కలిసినట్లు వెల్లడించారు.