జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల కస్టడీ
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేసిందన్న ఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు జ్యుడీషియల్ కస్టడీని హర్యానాలోని హిసార్ స్థానిక కోర్టు పొడిగించింది. గత గురువారం ఆమె పోలీస్ కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను సోమవారం కోర్టు ముందు హాజరుపరిచారు.వాదనలు విన్న అనంతరం కోర్టు ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీని విధించింది. కాగా గూఢచర్యం కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇప్పటివరకు పది మందిని అరెస్ట్ చేశారు.