నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. త్వరలోనే రైతుల ఖాతాల్లోకి
ఏప్రిల్ నెలలో అకాల వర్షాల కారణంగా రైతులు భారీగా పంట నష్టాన్ని చవిచూశారు. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న రైతులకు పెట్టుబడి రాయితీని తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రూ.5.37 కోట్ల డబ్బులను విడుదల చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో విడుదల చేశారు. త్వరలోనే రైతుల అకౌంట్లలోకి ఈ డబ్బులు జమ కానున్నాయి.