పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేసిన భారత్

News Published On : Monday, May 12, 2025 04:32 PM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్’ ను విజయవంతంగా చేపట్టింది. అయితే తాజాగా పాకిస్థాన్ కు చెందిన మిరాజ్ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు భారత ఆర్మీ వీడియో విడుదల చేసింది. 'గగనతలంలో శత్రువును ధ్వంసం చెయ్' అన్న క్యాప్షన్ తో విడుదల చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.