Breaking: ఏపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ను వెనకనుంచి కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారు రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను రాజమహేంద్రవరం కవలగొయ్యికి చెందిన వారిగా గుర్తించారు.