నేడే ఖాతాల్లోకి రూ.15 వేలు
సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా 'తల్లికి వందనం' అమలుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 67లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.15వేలు జమ చేయనుంది. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15వేల చొప్పున అందజేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు.
మొత్తం రూ.8,745 కోట్లను ఈరోజు తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. కూటమి పాలనకు నేటితో ఏడాది పూర్తి కానున్న విషయం తెలిసిందే.