ఆ రైతులకు రూ.1.10 లక్షలు: మంత్రి అచ్చెన్నాయుడు
ఏపీలో వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని తెలిపారు. త్వరలోనే మిగిలిన జిల్లాల్లో కూడా ఆ ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు.
అరటి రైతులకు హెక్టారుకు రూ.35,000 ఇన్పుట్ సబ్సిడీ, మొక్కలు నాటుకునేందుకు అదనంగా మరో రూ.75వేలు అందజేస్తామని ప్రకటించారు. మొత్తంగా అరటి రైతుకు హెక్టారుకు రూ.1.10 లక్షలు సాయం చేస్తామని తెలిపారు.