రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్
రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 3 నెలల రేషన్ బియ్యం జూన్ నెలలోనే ఇవ్వనుంది. రానున్న వానాకాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి జూన్ నెలలో ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది. కార్డుదారులు డీలర్ వద్ద ఈపాస్ యంత్రంలో మూడుసార్లు బయోమెట్రిక్ లేదా ఐరిస్ గుర్తింపు వేయాల్సి ఉంటుంది.