రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

News Published On : Wednesday, May 28, 2025 04:12 PM

రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 3 నెలల రేషన్ బియ్యం జూన్ నెలలోనే ఇవ్వనుంది. రానున్న వానాకాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆహార ధాన్యాల నిల్వ, రవాణాలో ఇబ్బందులు తలెత్తుతాయని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి జూన్ నెలలో ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది. కార్డుదారులు డీలర్ వద్ద ఈపాస్ యంత్రంలో మూడుసార్లు బయోమెట్రిక్ లేదా ఐరిస్ గుర్తింపు వేయాల్సి ఉంటుంది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...