లాసెట్ పరీక్ష రాసిన రిటైర్డ్ IPS
రాష్ట్ర వ్యాప్తంగా నేడు లాసెట్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షల్లో భాగంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లా చదవాలనే ఆసక్తితో ఒంగోలులోని రైజింగ్ ఇనిస్టిట్యూట్ లో మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లా సెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. రిటైర్డ్ ఐపీఎస్ ఇలా పరీక్షకు హాజరవడం అధ్యాపకులు, అభ్యర్థులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఆయన ఇటీవల ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు.