Breaking: బార్డర్ లో ప్రమాదం.. ఏడుగురు మృతి
రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మేరకు రైల్వే ట్రాక్ పై బ్రిడ్జి కూలడంతో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యాన్ని అందించాలని అధికారులు ఆదేశించారు.