హర్ష సాయిపై కేసు నమోదు
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నందుకు యూట్యూబర్ హర్ష సాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదని, బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు సజ్జనార్ తెలిపారు.
బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది నష్టపోతున్నారని, వీటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటికే పలువురు యూట్యూబర్లపై తెలంగాణలో, ఏపిలో కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.