వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు
వైసీపీ నేత , మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు రిమాండ్ పొడిగించింది. వచ్చే నెల 8 వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు తెలిపింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీతోపాటు మరో నలుగురికి కోర్టు రిమాండ్ విధించింది. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ నెలకుపైగా విజయవాడ జైలులో ఉన్న విషయం తెలిసిందే.