ఏపిలో మళ్ళీ కరోనా కలకలం
ఏపీలో మళ్ళీ కరోనా కలకలం మొదలైంది. కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో అతనికి కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. అతనిని నంద్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. నిన్న విశాఖలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.