మెట్రోపై కేబినెట్ కీలక నిర్ణయం
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మూడు కారిడార్ లలో మెట్రో ఫేజ్-2బీ విస్తరణకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కాగా రూ.19,579 కోట్లతో 86.1 కి.మీ.ల మేర మెట్రోను విస్తరించనున్నారు. ఈ అంశంలో భాగంగా కారిడార్-1 శంషాబాద్-ఫ్యూచర్ సిటీ(39.6 కి.మీ.లు) కారిడార్-2 జేబీఎస్-మేడ్చల్ (24.5 కి.మీ.లు) కారిడార్-3 జేబీఎస్-శామీర్ పేట్(22 కి.మీ.లు) వరకు మెట్రోను అభివృద్ధి చేయనున్నారు.