ఎల్లుండి నుండి కొత్త పథకం అమలు
తెలంగాణలో ఈ నెల 14వ తేదీ నుంచి భూభారతిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో భూభారతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మొదట పైలట్ ప్రాజెక్టుగా భూభారతిని అమలు చేయనున్నట్లు చెప్పారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మూడు మండలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు.