మెగా డిఎస్సీపై ప్రభుత్వం కీలక ప్రకటన
మెగా డిఎస్సీపై ఏపి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 16,247 టీచర్ పోస్టుల భర్తీకి మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించింది.
జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని, త్వరలో టీచర్ల బదిలీల చట్టం తేనున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. వీసీల నియామకం పూర్తయ్యాక అన్ని యూనివర్సిటీలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని చెప్పారు.