మేం అధికారంలోకి వచ్చాక 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేస్తాం: జగన్
ఉగాది సందర్భంగా వైకాపా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. వైకాపా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రస్తుతమున్న 13 జిల్లాలను 25 జిల్లాలుగాచేస్తామని వైఎస్ జగన్ కీలక హామీ ఇచ్చారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తామని స్పష్టం చేసారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన తరువాత మీడియాతో మాట్లాడిన జగన్, ఇప్పటికే జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలపై చర్చించామని తెలిపారు.
రాబోయే కొత్త జిల్లాల పేర్లు ఇలా ఉన్నాయి:
- అరకు
- శ్రీకాకుళం
- విజయనగరం
- విశాఖపట్నం
- అనకాపల్లి
- కాకినాడ
- అమలాపురం
- రాజమండ్రి
- నరసాపురం
- ఏలూరు
- మచిలీపట్నం
- విజయవాడ
- గుంటూరు
- నరసరావుపేట
- బాపట్ల
- ఒంగోలు
- నంద్యాల
- కర్నూలు
- అనంతపురం
- హిందూపూర్
- కడప
- నెల్లూరు
- తిరుపతి
- రాజంపేట
- చిత్తూరు