భారత్ ప్రాజెక్టు కోసం అమెరికా కంపెనీ ఆసక్తి
భారత్ చేపట్టిన ఐదోతరం యుద్ధ విమానాల ప్రాజెక్టు కోసం ఇంజిన్లను తయారు చేసేందుకు తమ సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ CEO లారీ కల్ప్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో పాటు ఆమ్కా(అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్)కు ఇంజిన్లను అందించే కాంట్రాక్ట్ కోసం పోటీ పడతామని పేర్కొన్నారు. పౌర, మిలిటరీ వైమానిక రంగ కార్యకలాపాల్లో భారత్ ను ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తున్నట్లు తెలిపారు.