భారత్కు మద్దతుగా 57 ముస్లిం దేశాలు
పాకిస్తాన్ కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. తమకు ఇస్లామిక్ దేశాల మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పుకునే పాకిస్థాన్ కు పరాభవం ఎదురైనట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ కు సపోర్ట్ చేసేందుకు ఆ దేశాలు నిరాకరించినట్లు సమాచారం. 57 సభ్య దేశాలున్న ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ను భారత్ సంప్రదించగా ఈ విషయాన్ని ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. కాగా సౌదీ, మలేషియా భారత్ కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.