నేడు టీవీ, ఓటీటీలోకి సంక్రాంతికి వస్తున్నాం
అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేశ్ కాంబోలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఈ రోజు (శనివారం) టీవీ, ఓటీటీలోకి రానుంది. సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానల్లో, జీ5 యాప్లో స్ట్రీమింగ్ కానుంది.
సాధారణంగా కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చిన కొద్దిరోజులకు టీవీలో ప్రసారం చేస్తారు. కానీ ఈ మూవీని ఒకేసారి TV, OTTలోకి వదులుతుండటం గమనార్హం. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది.