ఓటీటీతో పాటు టివిలోకి "సంక్రాంతికి వస్తున్నాం"

Entertainment Published On : Friday, February 21, 2025 10:00 AM

విక్టరీ వెంకటేశ్ హీరోగా, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా త్వరలో టీవీతో పాటు OTTలో రానుంది. మార్చి మొదటి వారంలో జీ తెలుగులో టీవీలో వచ్చిన తరువాత రోజు నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.

'కమింగ్ సూన్' అంటూ ZEE5 కూడా ట్వీట్ చేసింది. కానీ స్ట్రీమింగ్ డేట్ ను వెల్లడించలేదు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే.

అనన్య నాగళ్ల క్యూట్ & హాట్ ఫోటోస్

See Full Gallery Here...