పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్
పవన్ కల్యాణ్ అభిమానులకు శుభవార్త. ముంబైలో నేటి నుంచి పవన్ కల్యాణ్ నటిస్తున్న 'ఓజీ' చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈరోజు నుంచే పవన్ కల్యాణ్ షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ఇందుకోసం ముంబైలో ఓ భారీసెట్ వేసినట్టు తెలుస్తోంది. అలాగే రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా పెద్దసెట్ వేశారని టాక్. సెప్టెంబరు 26న ఈ మూవీ విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ఆలోచిస్తోంది.