సీమంతం జరిగిన 10 రోజులకే గర్భిణి మృతి

Crime Published On : Sunday, May 25, 2025 12:30 PM

సీమంతం జరిగిన 10 రోజులకే గర్భిణి మృతి చెందిన విషాదకర ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. బిచ్కుందకు చెందిన మంగలి సునీల్ కు గతేడాది మద్నూర్ మండలం పెద్దతడూర్ గ్రామానికి చెందిన జ్యోతి(27)తో వివాహమైంది. ఆమె ఐదు నెలల గర్భిణి కాగా ఈ నెల 14న బిచ్కుందలో సీమంతం నిర్వహించారు.

అయితే భార్యాభర్తలు ద్విచక్రవాహనంపై వస్తుండగా బిచ్కుంద శివారులోని పెద్ద మైసమ్మ గుడి వద్ద వాహనం నుండి జ్యోతి జారి కిందపడ్డారు. తలకు గాయాలయ్యాయి. అంబులెన్సులో బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...