పాకిస్తాన్ గూఢచర్యం.. ఇంజనీర్ అరెస్ట్..
భారత యుద్ధనౌకల వివరాలను పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానేలో మెకానికల్ ఇంజినీర్ గా పనిచేస్తున్న రవీంద్ర వర్మ(27) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు అతడిని విచారించగా పాక్ ఏజెంట్ల ఉచ్చులో పడి యుద్ధ నౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని చేరవేసినట్లు గుర్తించారు. ఫేస్ బుక్ ద్వారా పాకిస్థానీ ఏజెంట్ లకు సమాచారం చేరవేసినట్లు నిర్ధారించారు.