జైపాల్ రెడ్డి పచ్చి సమైక్యవాది : ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి

Sunday, July 28, 2019 02:11 PM Politics
జైపాల్ రెడ్డి పచ్చి సమైక్యవాది :  ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్‌ రెడ్డి(77)కన్నుమూశారు. కొద్దిరోజులుగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆస్పత్రిలో 20వ తేదీ నుంచి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం అర్ధరాత్రి 1:28 గంటలకి ఆయన తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆయన మృతితో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. జైపాల్‌రెడ్డి అకాల మృతి కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటని ఆ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జైపాల్ రెడ్డి గురించి ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన పచ్చి సమైక్యవాది అని అనుకోని పరిస్థితుల్లో తెలంగాణాకు ఒప్పుకున్నారని తెలిపారు. ఆయన ఏం అన్నారో ఈ వీడియోలో చూడవచ్చు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: