50 కొత్త మున్సిపాలిటీలను ప్రకటించిన జగన్..
జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 50 మున్సిపాలిటీలను ప్రకటించింది, వీటి వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో గురజాల, నిజాంపట్నం ను మున్సిపాలిటీగా, దాచేపల్లి, నడికుడిలను ఉమ్మడి మున్సిపాలిటీగా ప్రకటించారు.
ప్రకాశం జిల్లాలో దర్శి, పొదిలి, మార్టూరు, టంగుటూరు, సింగరాయకొండ, వేటపాలెం.
కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, కైకలూరు, మైలవరం, పామర్రు, విస్సన్నపేట.
చిత్తూరు జిల్లాలో కుప్పం.
కర్నూలు జిల్లాలో బేగంచర్ల, కోయిలకుంట్ల, పత్తికొండ, కోడుమూరు, బనగానపల్లె, పాణ్యం.
విశాఖపట్నం జిల్లాలో ఆనందపురం, నక్కపల్లి, పాయకరావు పేట.
విజయనగరం జిల్లాలో కురుపాం, చీపురుపల్లి-గరివిడి (ఉమ్మడిగా).
శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, రణస్థలం.
కడప జిల్లాలో రైల్వే కోడూరు, నందలూరు, వేంపల్లి.
తూర్పు గోదావరి జిల్లాలో కొత్తపేట, రావులపాలెం, అనపర్తి, జగ్గంపేట.\
పశ్చిమ గోదావరి జిల్లాలో ఆకివీడు, చింతలపూడి, అత్తిలి.\
అనంతపురం జిల్లాలో పెనుకొండ, ఉరవకొండ, గోరంట్ల.
నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డి పాలెం-వవ్వూరు (ఉమ్మడిగా), కోట-వాకాడు-గూడలి, ఆలూరు, పొదలకూరు, ముత్తుకూరు, రాపూరు, తడ-తడ కండ్రిగ (ఉమ్మడిగా) మున్సిపాలిటీలుగా ప్రకటించారు.